Monday, May 20, 2024

పాకిస్తాన్ వద్ద అణుబాబు ఉంది..మనం గౌరవించాలి..కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

spot_img

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని..వారిని మనం గౌరవించాలని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్థాన్‌ను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కూడా సార్వభౌమాధికార దేశమని, అది కూడా గౌరవనీయమని మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఆ గౌరవాన్ని కొనసాగిస్తూనే..కఠినంగా మాట్లాడండి తప్పులేదు ..చేతులో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారు. అది ఎలాంటి పరిష్కారం చూపదు. కేవలం ఉద్రిక్తతను మాత్రమే పెంచుతుంది. ఓ పిచ్చినాయకుడు ఆ దేశానికి ప్రధాని అయితే దేశం ఏమవుతుంది? వారి వద్ద అణు బాంబులు ఉన్నాయంటూ పేర్కొన్నారు.

మనం ప్రపంచానికి అగ్రగామిగా ఎదగాలంటే, పాకిస్థాన్‌తో సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా, సమస్యకు పరిష్కారం వెతకడానికి కష్టపడుతున్నామని మనం అర్థం చేసుకోవాలని మణిశంకర్ అయ్యర్ అన్నారు. గత పదేళ్లుగా ఈ పనులన్నీ నిలిచిపోయాయి. వారికి బలం లేనప్పుడు ఈ విధానం పని చేస్తుంది.కానీ అలాంటి దేశంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..మనం ఇబ్బందుల్లో పడతామంటూ మణిశంకర్ అన్నారు. మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి..కారుబోల్తాపడి పార్టీ నాయకురాలి మృతి.!

Latest News

More Articles