Monday, May 20, 2024

నేటితో కేసీఆర్ బస్సు యాత్ర ముగింపు.!

spot_img

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. వరుస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార వేగాన్ని పెంచి పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేటితో కేసీఆర్ బస్సు యాత్ర ముగిస్తుంది. సాయంత్రం సిద్ధిపేటలో పర్యటించనున్నారు కేసీఆర్.

రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం సిద్ధిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభతో కేసీఆర్ ప్రచారం ముగుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మార్చింది. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేసీఆర్ కు ప్రతిచోటా ప్రజలు నీరాజనం పలుకుతూ జై కొడుతున్నారు.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వద్ద అణుబాబు ఉంది..మనం గౌరవించాలి..కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు..!

Latest News

More Articles