సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జంగమ సమాజ్ భవన నిర్మాణానికి 10 గుంటల భూమిని కేటాయిస్తూ భూ పత్రాలను అందించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగాయత్ సమాజంలో ఒకరైన జంగమ సమాజ్ కృషి సమాజ నిర్మాణంలో ఎంతగానో ఉందన్నారు.
జహీరాబాద్ లో జంగమ సమాజ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం సంతోషంగా ఉంది. భవన నిర్మాణానికి మా సహాయం ఉంటుంది. సీఎం కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలవాలని మంత్రి హరీశ్ రావు కోరారు.