Friday, May 10, 2024

కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌లుపును దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు

spot_img

మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వ‌మే వ‌స్త‌ది.. ఇందులో ఏం అనుమానం లేదు.. రంది ప‌డాల్సిన అస‌వ‌రం లేద‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌లుపును దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

ఆనాడు మీ అండ‌దండ‌ల‌తో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. నా చావుకు కూడా తెగించి దీక్ష ప‌ట్టి తెలంగాణ సాధించాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రం సీఎం రేవంత్  సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్.. నీ గుడ్లు పీకి గోటీలు అడుకుంటా. నీ పేగులు తీసి మెడ‌లు వేసుకుంటా. ఆఖ‌రికి వ‌స్తే నీ ముడ్డి మీద చెడ్డి కూడా గుంజుకుంటా.. ఇది సీఎం మాట్లాడే భాషేనా..? ఇది ధ‌ర్మ‌మేనా..? తెలంగాణ సాధించిన వ్య‌క్తిని, ఇన్నేండ్లు పోరాటం చేసిన వ్య‌క్తిని, వ‌చ్చిన తెలంగాణ‌ను తెల్ల‌గా చేసిన వ్య‌క్తిని, మంచినీళ్లు, సాగు నీళ్లు, కరెంట్ కోసం తండ్లాడిన వ్య‌క్తిని.. న‌న్ను ప్ట‌టుకుని ఇన్ని మాట‌లు అనొచ్చానా..? ఇది ధ‌ర్మ‌మేనా..?ఇద‌ఇ మ‌న తెలంగాణ గౌర‌వ‌మా..? అని కేసీఆర్ నిల‌దీశారు.

మీరే న్యాయం, ధ‌ర్మం చెప్పండి.. క‌ర్రు కాల్చి వాత పెట్టండి.. ఎవ‌రిని అందలం ఎక్కించాలో నిర్ణ‌యించేది మీరే.. ఆ శ‌క్తి ఉన్న‌ది మీ ద‌గ్గ‌ర. ధ‌ర్మాన్ని గెలిపించండి.. బీఆర్ఎస్ గెలిపించండి. మ‌ళ్లా మ‌న గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది.. ఇది గ్యారెంటీ. ఎక్క‌డ పోయినా నా బ‌స్సును క‌ద‌ల‌నివ్వ‌డం లేదు. క‌చ్చితంగా జ‌నం మారిపోయారు.. అర్థ‌మైపోయింది. ఈ ప్ర‌భుత్వానికి చుర‌క‌ పెట్టాల‌ని, బ‌లుపు దించాల‌ని ప్ర‌జ‌లు ఉన్నారు. ఏం అనుమానం లేదు మ‌న ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది. అన్ని బ్ర‌హ్మాండంగా చేసుకుందాం. రంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని కేసీఆర్ తెలిపారు.

ఇది కూడా చదవండి:రేవంత్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కోమ‌టిరెడ్డి కుట్ర

Latest News

More Articles