దేశంలో అత్యంత ఖరీదైన నగరాల పేర్లను ప్రకటించింది మెర్సర్స్ సర్వే సంస్థ. మెర్సర్స్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక ప్రకారం అత్యంత ఖరీదైన నగరంగా ముంబై అగ్ర స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో 147 స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్ కతా 211, పూణె 213 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది.