Saturday, May 11, 2024

స్విమింగ్ పూల్ లో నీటమునిగి యువకుడు మృతి

spot_img

సికింద్రాబాద్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ క్లబ్ లో ఉన్న స్విమింగ్ పూల్ లో నీటమునిగి సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న వారిని స్విమింగ్ కు యాజమాన్యం అనుమతించడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంపత్ డైవ్ చేసిన వెంటనే నీటమునిగి చనిపోయాడని నిర్వాహకులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

Latest News

More Articles