దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారతరత్న’ వస్తే సంతోషంగా ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రభుత్వ సహకారంతో త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిన్న(గురువారం) ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం తర్వాత ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టుతో మీడియాతో మాట్లాడిన చిరు… పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. తనతో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగానే నాకు ఈ అవార్డు వచ్చిందన్నారు. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను అని అన్నారు. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు