Monday, May 20, 2024

సంక్షేమ ఫథకాల అమలు బీఆర్ఎస్ తోనే సాధ్యం

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగానే హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా మారిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అంతేకాదు..తెలంగాణ అభివృద్ధి, పేదలకు సంక్షేమ ఫథకాలు అందించడం కూడా బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఇవాళ( శుక్రవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలోని పలు పార్కుల్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన… విదేశీ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. పదేండ్ల కాలంలో కూకట్‌పల్లి జరిగిన అభివృద్ధిని చూసి..  పార్లమెంట్‌ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  పదేండ్ల కాలంగా కూకట్‌పల్లిలో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను ఆధునీకరించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా, ప్లే గ్రౌండ్స్ గా అభివృద్ధి చేశామని తెలిపారు.

మరోవైపు  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు అందించినట్లు తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మాయమాటలతో అధికారంలోకి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమిలేదన్నారు.తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది

Latest News

More Articles