సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వాహనాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ టాస్క్ ఫోర్స్ వాహనాలు బాలానగర్ మరియు జీడిమెట్ల జోన్ పరిధిలో ట్రాఫిక్ను నియంత్రించడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. ఇప్పటివరకూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో 16 మోటార్ సైకిళ్లు ఉండగా ప్రస్తుతం అవి 18కి చేరాయన్నారు. ఈ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారన్నారు. పీక్ అవర్స్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్ ఫోర్స్ టీంలు పెట్రోలింగ్ చేస్తుంటాయి. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ అడ్మిన్ యోగేశ్ గౌతమ్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ నితిక పంత్, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.