Saturday, May 18, 2024

మెరుగైన చికిత్స కోసం ముంబై హాస్పిటల్ కి రిషబ్ పంత్

spot_img

ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ని డెహ్రాడూన్ లోని ప్రైవేటు హాస్పటల్ నుండి ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించనున్నారు. గత శుక్రవారం పంత్ నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మోకాలులో లిగమెంట్ కట్ అయిపోవడంతో పాటు, నుదురు, వీపుపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం పంత్ ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్ వైద్య రిపోర్ట్ లను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అతడిని విదేశానికి తరలించే ఆలోచన చేస్తున్నట్టు, ముఖ్యంగా లండన్ కు తరలించొచ్చని సమాచారం.

Latest News

More Articles