Friday, May 3, 2024

ప్రేమకు అడ్డొస్తాడేమోనని తండ్రి కాళ్లు విరగొట్టించిన కూతురు

spot_img

తన ప్రేమకు తండ్రి ఎక్కడ అడ్డువస్తాడోనని భయపడిన ఓ యువతి దారుణానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి మరీ తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలూకాలో జరిగింది. మహేంద్ర షా అనే వ్యాపారవేత్త కుమార్తె సాక్షి.. చైతన్య అనే యువకుడిని ప్రేమించింది. తమ ప్రేమకు తండ్రి అడ్డురాకూడదని భావించిన సాక్షి.. ప్రియుడితో కలిసి తండ్రి కాళ్లు విరగ్గొంటించాలని పథకం పన్నింది. అందులో భాగంగా నలుగురు వ్యక్తులను రూ. 60 వేలకు మాట్లాడుకున్నారు.

ముందస్తు ప్లాన్‌లో భాగంగా పూణె వెళ్లిన సాక్షి ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్పాల్ ప్రాంతంలో బస్సు దిగి తండ్రికి ఫోన్ చేసింది. కారులో వచ్చిన ఆయన కుమార్తెను తీసుకుని వెళ్తుండగా వాడచివాడి గ్రామ సమీపంలో టాయిలెట్ కోసం సాక్షి కారును ఆపించింది. అదే అదునుగా వెనక బైక్‌లపై ఫాలో అవుతున్న నలుగురు దుండగులు మహేంద్రపై దాడిచేసి చావగొట్టారు. ఆయన రెండు కాళ్లూ విరగ్గొట్టారు. అక్కడితో ఆగక తలపై పదునైన ఆయుధంతో పొడిచి పరారయ్యారు. మహేంద్ర అరుపులు విన్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకుని మహేంద్రను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాక్షి తీరు అనుమానంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కుట్ర బయటపడింది. తన ప్రేమకు అడ్డు వస్తాడన్న భయంతోనే తానే ఈ పనిచేయించినట్టు అంగీకరించింది. సాక్షి, ఆమె ప్రియుడు చైతన్యతోపాటు సుపారీ తీసుకున్న నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest News

More Articles