హైదరాబాద్ : రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 5,089 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్జీటీ,1739 స్కూల్ అసిస్టెంట్, భర్తీ చేయనుండగా..మరో వైపు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.