Monday, May 20, 2024

ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తా

spot_img

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను చేయగలిగినంతా చేశానని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అన్నారు. అందరం కలిసి రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పారు. కాబోయే సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని పార్టీ హైకమాండ్ కే వదిలేద్దామని డీకే పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీకి రమ్మంటూ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. అయితే..ఇవాళ(సోమవారం) తన పుట్టిన రోజు కావడంతో వెళ్లలేకపోయానని తెలిపారు.

అంతేకాదు..పార్టీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు డీకే శివకుమార్. కర్ణాటక ప్రజలు తన పుట్టిన రోజుకు 135 సీట్లను బహుమతిగా ఇచ్చారని.. ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకేం ఉంటుందని అన్నారు.

Latest News

More Articles