తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం అని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం ఉందని వారన్నారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.