సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని చాలా యాక్టివ్గా ఉంటుంది. తండ్రిలాగే సోషల్ మీడియాలో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సితార రెడ్ కలర్ లెహంగా ధరించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ బాబు హీరోగా పాపులర్ అయినట్లే ఆయన కూతురు సితార ఘట్టమనేని కూడా పాపులర్ అయింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా రెడ్ కలర్ లెహంగా ధరించిన కొన్ని ఫోటోలను సితార తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో సితార క్యూట్గా కనిపించింది. అయితే ఇప్పుడు లెహంగా ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. సితార ధరించిన ఈ లెహంగా ధర రెండున్నర లక్షలకు పైగానే ఉంటుందట. దసరా సందర్భంగా సెలబ్రిటీ డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఈ లెహంగాను సితార ధరించింది.
ఇది కూడా చదవండి: దారుణం..హిజాబ్ ధరించలేదని 16ఏళ్ల అమ్మాయిని కొట్టిచంపిన పోలీసులు..!!
ఇక సితార తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేయనుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహారిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సితార ఆభరణాల బ్రాండ్ PMG జ్యువెల్స్ కోసం ఒక ప్రకటనలో బిల్బోర్డ్లో కనిపించింది. పీఎంజీ జ్యువెల్స్ బ్రాండ్ అంబాసిడర్ కూడా. దీని ద్వారా, సితార అతి చిన్న వయస్సులో అతిపెద్ద ప్రకటనను పొందిన మొదటి స్టార్ కిడ్ అనే క్రెడిట్ ను సొంతం చేసుకుంది. టైమ్స్ స్క్వేర్ ప్రకటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీఎంజీ బ్రాండ్ అంబాసిడర్గా సితార పారితోషికం తీసుకున్న వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఈ రెమ్యునరేషన్తో సితార ఏం చేసిందనేది కూడా చర్చనీయాంశమైంది.
View this post on Instagram