Friday, May 17, 2024

సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

spot_img

సొంత స్థలం ఉన్న వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నామని జుక్కల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. అర్హులందరికీ విడుతల వారీగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్‌ శివనందప్ప, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles