హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 4 వ తేదీన పోలీస్ సురక్షా దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 500 డ్రోన్లతో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని దుర్గం చెరువు వద్ద గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తూ డ్రోన్ కొరియోగ్రఫీ నిర్వహించనున్నారు.
ఈ డ్రోన్ కొరియోగ్రఫీ జూన్ 4 వ తేదీన దుర్గం చెరువు వద్ద సాయంత్రం 07:30 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం లోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనను చూడడానికి పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నగర ప్రజలను కోరారు.