న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లో ఆదివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 3.1 తీవ్రతగా నమోదైంది. హరియాణలోని ఫరీదాబాద్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రజలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.