Monday, May 20, 2024

సంజయ్ సింగ్ లీగల్ నోటీసుతో తోక ముడిచిన ఈడీ..!

spot_img

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తప్పుల తడక వ్యవహారం మరోసారి బయటపడ్డది. ఛార్జ్ షీట్లలో ఆధారాలు లేకుండా పేర్లను పేర్కొంటూ భయభ్రాంతులు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతిస్తున్నది. తాజగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సవాల్ తో ఈడీ దర్యాప్తు వ్యవహారం బయటకు వచ్చింది.

సంజయ్ సింగ్ లీగల్ నోటీసుతో ఈడీ తోక ముడిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశంలో ఈడీ తన పేరును ఛార్జ్ షీట్ లో పేర్కొనడంపై ఈడీకి సంజయ్ సింగ్ లీగల్ నోటీసులు పంపారు. ఛార్జ్ షీట్ లో ఈడీ తన పేరు ఇరికించి, అబద్ధపు ప్రచారంతో తన ప్రతిష్ఠ దెబ్బతీసిందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

టైపోగ్రాఫికల్/క్లరికల్ లోపం అనుకోకుండా జరిగినట్లు సంజయ్ సింగ్ కు ఈడీ వివరణ ఇచ్చింది. రాహుల్ సింగ్’కి బదులుగా ‘సంజయ్ సింగ్’ అని అనుకోకుండా ప్రస్తావించినట్లు ఈడీ ఒప్పుకున్నది.

Latest News

More Articles