Friday, May 10, 2024

నకిలీ ఐస్ క్రీం కేంద్రంపై పోలీసుల దాడులు

spot_img

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో నకిలీ ఐస్ క్రీం ముఠా గుట్టురట్టయింది. ఆమనగల్లు పట్టణంలో ఐస్ క్రీం తయారుచేస్తున్న కేంద్రంపై శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించి ఈ దాడుల్లో నకిలీ ఐస్ క్రీం లు ఉన్నట్లు గుర్తించారు. వారివద్ద నుంచి సుమారు 9.50 లక్షల విలువ చేసే నకిలీ ఐస్ క్రీం లు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పుడ్ షెఫ్టి అథారిటీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా నకిలీ ఐస్ క్రీం లు తయారు చేస్తున్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బోరు నీళ్లతో ఐస్ క్రీంలు తయారు చేసి వివిధ కంపెనీల పేర్లతో  స్టిక్కర్లు వేసి ప్రజలకు విక్రయాలు జరుపుతున్నారు. మెగా ఐస్ క్రీం కేంద్రాన్ని సీజ్ చేసి  ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles