తెలంగాణలో రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం శుక్రవారం ఓటరు జాబితా షెడ్యూల్ను విడుదల చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ను ప్రకటించింది. ఇటీవల ఆయా స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికలకు ఈసీ సిద్ధం చేస్తున్నది.
ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా ప్రకటించనుండగా.. మార్చి 14 వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4న ఓటర్లకు జాబితా విడుదల చేయనున్నది. పట్టభద్రులందరూ ఓటరు నమోదు చేసుకోవాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది.