ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరింది. దీపావళికి ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరడంతో అధికార యంత్రాంగం అలర్టైంది. నవంబర్ 13 నుంచి 20 వరకూ వాహనాల రాకపోకలకు సంబంధించి మళ్లీ సరి-బేసి విధానం అమలు కానుంది. మరోవైపు నిర్మాణ పనులకు బ్రేక్ ఇవ్వడంతో పాటు 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులను నవంబర్ 10 వరకూ నిలిపివేశారు అధికారులు.
ఇది కూడా చదవండి: కోహ్లీ సెంచరీలా బీఆర్ఎస్ 100 సీట్లు సాధిస్తుంది