సికింద్రాబాద్ : గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ఆభరణాలు కాజేసిన నకిలీ వైద్యుడు వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 4.9 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు గోపాలపురం పోలీసులు తెలిపారు.
నిందితుడు వెంకటేశ్వర్లు పై తెలంగాణ, ఆంధ్రాలో 9 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఐఏఎస్, డాక్టర్, టికెట్ కలెక్టర్ గా నమ్మించి మోసలకు వెంకటేశ్వర్లు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.