Friday, May 17, 2024

ప్రముఖ సినీ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూత

spot_img

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిషిగాన్ లో ఉంటున్నారు. కూతురు దగ్గరకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భాంతికి గురయింది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

‘స్వర్గం నరకం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు ఈశ్వర్ రావు పరిచయం అయ్యారు. ఇదే సినిమాతోనే మోహన్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ప్రేమాభిషేకం,ప్రెసిడెంట్ గారి అబ్బాయి, ఘరానా మొగుడు లాంటి 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇది కూడా చదవండి: ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు

Latest News

More Articles