వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఆకస్మాత్తుగా కారుపై పడింది. ఈ ఘటనలో ఒక్కరు మరణించగా…పలువురికి గాయాలయ్యాయి. శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు కలకలం..!