Monday, May 13, 2024

ఘోరరోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..!!

spot_img

పెరూలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 24మంది మరణించారు. మరో 35మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ పెరూలోని హువాన్ కావెలికాలో జరిగిందిన అక్కడి పోలీసులు తెలిపారు. ప్రయాణికులతో నిండిన బస్సు హువాన్కావెలికాలోని లోతైన లోయడలో పడటంతో 24మంది మరణించారని అధికారులు తెలిపారు.

తెల్లవారుజామున 1:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రయాణికులతో కూడిన బస్సు హువాన్ కావెలికా ప్రాంతానికి వెళ్తోంది. ఈ సమయంలో బస్సు ప్రమాదానికి గురైందని 200మీటర్ల లోతులో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, 24 మంది మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడ్డారని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

 

 

Latest News

More Articles