Tuesday, May 21, 2024

కొడుకు సర్టిఫికెట్ల కోసం డబ్బులు లేక పురుగుల మందు తాగిన తండ్రి

spot_img

మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొడుకు సర్టిఫికెట్లు తీసుకోవడానికి డబ్బులు లేక ఓ తండ్రి పురుగుల మందు తాగాడు. జిల్లా కేంద్రంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని డాన్ పబ్లిక్ స్కూల్‎లో ఓ విద్యార్థి పదో తరగతి పూర్తి చేశాడు. అతడు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థి ఇంకా తన సర్టిఫికెట్లను ఇంటర్ కాలేజీలో ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ల కోసం విద్యార్థి తండ్రి నర్సయ్య.. స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. కాగా.. సర్టిఫికెట్ల కోసం రూ. 20 చెల్లించాలని స్కూల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. నర్సయ్య దగ్గర అంత డబ్బు లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెంది.. స్కూల్ ఎదుటే పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles