ఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో ఉప ఉన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్, త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని ఏడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. జార్ఖండ్లోని డుమ్రి, కేరళలోని పుతుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, దాన్పూర్, వెస్ట్ బెంగాల్లోని ధుప్ గురి, యూపీలోని ఘోసి, ఉత్తరాఖండ్లోని భాగేశ్వర్ అసెంబ్లీ నియోజవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 10న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 17గా, 18న స్క్రూటినీ, 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించింది. అనంతరం సెప్టెంబర్ 5న ఎన్నికలు నిర్వహించి.. 8న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు తెలపనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.