హైదరాబాద్లో రేవ్ పార్టీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు భగ్నం చేశారు. మాదాపూర్ విఠల్ రావు నగర్లోని ఓ అపార్ట్ మెంట్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్తో పాటు మురళీ, బాలాజీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులనూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలాజీ గతంలో నేవీలో ఉద్యోగం చేశాడు.
రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి 2.8 గ్రాముల కోకైన్, 6 ఎల్ఎస్డి బోల్ట్, 25 ఎస్టాకి పిల్స్ , 72,000 నగదు, ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లను టీఎస్ న్యాబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తర్వాత నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితులు గోవా నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో బాలాజీకి సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. నైజీరియాలతో బాలాజీకి నేరుగా సంబంధాలన్నాయన్నారు. సినీ పరిశ్రమలో పలువురు కీలక వ్యక్తులకు బాలాజీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.
గుడిమల్కాపూర్ పిఎస్ లో బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు. బాలాజీ సమాచారం ద్వారా మాదాపూర్ అపార్ట్మెంట్ పై రైడ్ చేసిన పోలీసులు..నలుగురు డ్రగ్ సప్లయర్లతో పాటు, ముగ్గురు నైజీరియన్లు మరో 18 కన్జ్యూమర్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరూ అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు…సినిమాల్లో అవకాశం పేరుతో ఢిల్లీ నుండి ఆ యువతులను ఇక్కడికి వెంకట్ రప్పించినట్లు తెలుస్తోంది.