Saturday, May 4, 2024

పాస్ పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్నిప్రమాదం..కాలిబూడిదైన డాక్యుమెంట్లు..!

spot_img

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హెడ్ పోస్టాఫీసులోని పాస్ పోర్టు ఈసేవా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనేస్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి.

ఈ అగ్నిప్రమాదంలో కొన్నిడాక్యుమెంట్లు, ఇతర సామగ్రి కాలిపోయాయని పోస్టాఫీస్ అధికారులు వెల్లడించారు. అయితే మిగతా డేటా అంతా ఆన్ లైన్లో ఉందని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనా లేదా మరోదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: సిద్ధిపేటలో దారుణం..మూడేళ్ల చిన్నారిని చంపిన మేనమామ.!

Latest News

More Articles