ఖమ్మం: సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్కూట్ తో మంటలు చెలరేగి, దట్టంగా పొగ అలుముకున్నది. షార్ట్ సర్క్యూట్ సమయంలో డయాలసిస్ సెంటర్ లో పెషెంట్లు లేకపోవటంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలు అదుపు చేసారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.