Tuesday, May 14, 2024

ఎండిఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్

spot_img

హైదరాబాద్: ఎండిఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని ఛాదర్ ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ నగర్ కు చెందిన యువతి ఆయేషా ఫిర్దోజ్ ముంబై నుండి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు విచారణలో గుర్తించినట్లు చెప్పారు. సైదాబాద్ ప్రాంతంలో విద్యార్థులకు ఆయేషా డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు. ఆయేషా తో పాటు నలుగురు డిగ్రీ స్టూడెంట్స్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారన్నారు.

Latest News

More Articles