Sunday, May 19, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఐదేళ్ల బాబు కిడ్నాప్

spot_img

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై  ఐదేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. శివ సాయి అనే బాలుడు తల్లితో కలిసి ఊరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చాడు. మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ గా ఉన్న బాలుడిని గుర్తుతెలియని జంట తీసుకువెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Also Read.. కాంగ్రెస్‌లో టికెట్ల అమ్మకాల లొల్లి

కాగా, కొన్ని గంటల్లోనే బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని పోలీసులు గుర్తించారు. సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles