న్యూఢిల్లీ: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్లో ఈ ఉదయం జెండా ఎగురవేసిన ఆయన.. ఆ తర్వాత అస్వస్థకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను స్థాపించి బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి గుర్తింపు పొందారు.