Friday, May 10, 2024

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

spot_img

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇటీవల కాలంలో హుండీ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. నిన్న (ఆగస్టు 14) ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.5.67 కోట్లు హుండీ ద్వారా వచ్చింది. చాలా కాలం తర్వాత తిరుమల శ్రీవారికి ఆ స్థాయిలో ఆదాయం లభించింది. గత నెలలోనూ సోమవారాల్లో స్వామివారి హుండీ ఆదాయం రూ.5 కోట్లకు పైనే నమోదైంది. నిన్న(సోమవారం) తిరుమల వెంకన్నను 74,617 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,752 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. ఇవాళ(మంగళవారం) కూడా తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది.

Latest News

More Articles