బీహార్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు బాలికలు సజీవ దహనమైయ్యారు. ముజఫర్పూర్ లో నరేష్రామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న గుడిసెలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎగిసిపడి.. పక్కనే ఉన్న మరో మూడు గుడిసెలకు వ్యాపించాయి. దీంతో అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.