Saturday, May 11, 2024

విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ త‌గిలి నాలుగు ఏనుగులు మృతి

spot_img

పొలంలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ త‌గిలి నాలుగు ఏనుగులు మృతి చెందాయి. పార్వతీపురం మన్యం జిల్లా.. భామిని మండలంలో ఈ ఘోరం జరిగింది. పొలాల దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.

ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది.ప్రమాదంలో నాలుగు ఏనుగులు మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు  తప్పించుకుని సమీపంలోని తువ్వకొండవైపు  వెళ్లిపోయాయని వారు తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండవైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.

Latest News

More Articles