Monday, May 13, 2024

బెంగళూరు కేఫ్‌ పేలుడు లో న‌లుగురికి గాయాలు

spot_img

బెంగుళూరులోని ఫేమస్ హోటల్ రామేశ్వ‌రం కేఫ్‌లో పేలుడు జరిగింది. పేలుడులో క‌నీసం న‌లుగురు హోటల్ సిబ్బంది గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. గ్రీన్ అవెన్యూ రోడ్‌లో ఉన్న వైట్‌ఫీల్డ్ బ్రాంచ్ కేఫ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఏ కార‌ణంగా పేలుడు జ‌రిగిందో ఇంకా స్ప‌ష్టం కాలేదు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఓ సిలిండ‌ర్ వ‌ల్ల పేలుడు జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇది కూడా చదవండి:పంజాబ్‌లో దారుణం: ఆప్ కార్య‌క‌ర్త గుర్‌ప్రీత్ సింగ్ కాల్చివేత

Latest News

More Articles