Sunday, May 19, 2024

దారుణం.. గర్భిణీపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య…!!

spot_img

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మురేనా జిల్లాలో గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెకు నిప్పటించారు. 80శాతం గాలిన గాయాలతో ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తన భర్త మీద అత్యాచారఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు ఆ గర్భిణీ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఆమెపై ఆ మహిళ భర్తతోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ, ఈ ముగ్గురు కలిసి బాధితురాలిపై పెట్రోల్ పోశారు. నిప్పటించారు. బాధితురాలు గ్వాలియర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితురాలైన మహిళ భర్త గతంలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేశారని…కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్ రూల్స్ మారుస్తున్నాం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Latest News

More Articles