అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. దీనికి సంబంధించి బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక తెలిపింది.
మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అంబానీ ఒక్క స్థానం దిగువన 13లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.
ఇది కూడా చదవండి: సోమాలియా తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌక హైజాక్