Saturday, May 4, 2024

లక్నోకు గుడ్‌బై చెప్పిన గంభీర్.. ఈ సారి మెంట‌ర్‌గా..

spot_img

ఐపీఎల్‎ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ గెయింట్స్‎కు మెంట‌ర్‌గా ఉన్న గౌతం గంభీర్ ఆ జ‌ట్టుకు గుడ్‌బై చెప్పేశాడు. అతను మళ్లీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని కోల్‌క‌తా ఓన‌ర్ షారుక్ ఖాన్ స్వాగ‌తించారు. ల‌క్నో జ‌ట్టుకు గంభీర్ మెంట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఆ జ‌ట్టు 2022 ఎడిష‌న్‌లో ఫైన‌ల్‌కు వెళ్లింది. ఈ ఏడాది జరిగిన సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు లీగ్ స్టేజ్‌లో మూడ‌వ స్థానంలో నిలిచింది, కానీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. కాగా.. తాను ల‌క్నోను వీడుతున్న అంశంపై గంభీర్ భావోద్వేగ‌మైన సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

Read Also: లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టిన స్కూల్ పిల్లల ఆటో.. సీసీటీవీ ఫుటేజ్

‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా ప్రయాణం ముగిసింది. నా ఈ ప్రయాణంలో సహకరించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది మరియు ప్రతి ఒక్కరి పట్ల నేను ప్రేమ మరియు అపారమైన కృతజ్ఞతను కలిగిఉన్నాను. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీని సృష్టిస్తున్నప్పుడు నా ప్రయత్నాలన్నింటికీ విపరీతమైన మద్దతునిచ్చినందుకు డా. సంజీవ్ గోయెంకాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని మరియు ప్రతి అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ LSG బ్రిగేడ్!’ అంటూ పోస్ట్ చేశారు.

Latest News

More Articles