Monday, May 13, 2024

టూరిస్ట్‌ను చంపి.. నగ్నంగా ఊరేగించారు!

spot_img

ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధంలో అమాయకులు బలవుతున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై శనివారం సాయంత్రం నుంచి మెరుపు దాడులకు దిగి విధ్వంసం చేస్తున్నారు. దాదాపు 5 వేల రాకెట్ లాంచర్లతో అటాక్ చేసిన హమాస్ ఇజ్రాయెల్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆకస్మిక దాడుల నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ కు దిగింది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనా సరిహద్దుల్లోని హమాస్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఇరు పక్షాల పరస్పర దాడుల్లో సుమారు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.

అమాయకుల ప్రాణాలు బలి..

అకస్మాత్తుగా దాడికి దిగిన హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ సరిహద్దులు దాటుకుని ఆ దేశ పౌరులపై పైశాచికంగా విరుచుకుపడ్డారు. అమాయకులను కిడ్నాప్ చేసి.. హింసించి మానప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో నెటిజన్లను కలచివేస్తోంది. ఇజ్రాయెల్ లో మ్యూజికల్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ జర్మనీ టూరిస్టును హమాస్ ఉగ్రవాదులు చంపేసి.. బట్టలు లేకుండా నగ్నంగా తమ ట్రక్ వెనుక కట్టేసి ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో (అందులోని దృశ్యాలు చాలా హింసాత్మకంగా ఉండడం వల్ల వీడియోను ఇక్కడ పోస్ట్ చేయలేదు) వైరల్ కావడంతో.. జర్మనీకి చెందిన ఆ యువతి తల్లి ఆడి లౌక్ స్పందించింది.

నా బిడ్డే..

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది తన బిడ్డ షానీ లౌక్ అని ఆడి లౌక్ తెలిపారు. ట్రక్ కు కట్టేసి ఊరేగించిన మృతదేహం తన కూతురిదేనంటూ.. ఆమె పాస్ పోర్టును కూడా చూపించింది. షానీ ఓ టాటూ ఆర్టిస్ అని తెలిపింది. అయితే తొలుత ఆ మహిళ ఇజ్రాయెల్ మహిళా జవాన్ అని హమాస్ ఉగ్రవాదులు ప్రకటించారు. పలు వార్తా సంస్థలు కూడా దానిని ప్రసారం చేశాయి. కానీ ఆమెకు ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధం లేదని, జర్మన్ టూరిస్టు అని షానీ కుటుంబం తెలిపిందని ఆ తర్వాత అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు..

 

Latest News

More Articles