ఈ రోజు మార్కెట్లో పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు భారీగా తగ్గాయి. ఈ రోజు (బుధవారం) రూ.1090లు తగ్గి రూ.63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,850లు ఉండగా.. నేడు రూ. 1000లు తగ్గి రూ.57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 80,500 కాగా ఈరోజు ఏకంగా రూ.2000లు తగ్గి, రూ.78500లకు చేరుకుంది.
Read Also: మిచౌంగ్ ఎఫెక్ట్తో మరో రెండురోజులు భారీ వర్షాలు!
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110గా కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది.
పసిడి దారిలోనే వెండి కూడా పయనిస్తుంది. హైదరాబాద్లో వెండి ధర రూ. 81,500 ఉండగా, విజయవాడలో రూ. 81,400 ఉంది. ఇక చెన్నైలో రూ.81,400, ముంబాయిలో రూ. 89,500, బెంగళూరులో రూ. 79,250గా ఉంది.