హైదరాబాద్ : నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధికి తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి అన్నారు. హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన బాయిలర్, కోల్డ్ స్టోరేజ్, కొత్త పెరుగు ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. కస్టమర్లకు నాణ్యమైన పాలను సరఫరా చేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ డైరెక్టర్ బెలిదె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.