Tuesday, May 21, 2024

రేషన్‌కార్డు కేవైసీ ప్రక్రియను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

spot_img

రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారికోసం మరో అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ముందుగా నిర్ణయించిన గడువు ప్రకారం జనవరి 31తో అంటే ఈ నెల 31వ తేదీతో రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు ముగియనుంది. కానీ గత రెండు నెలలుగా ఈ కేవైసీ అప్ డేట్ చేస్తున్నా కొన్ని రేషన్ షాపుల వద్ద భారీ లైన్లు కనిపిస్తున్నాయి. దీంతో అప్ డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డుదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొంత మంది కేవైసీ అప్ డేట్ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు.

రేషన్ కార్డు ఈకేవైసీ అప్ డేట్ కు మరో నాలుగు రోజులే మిగిలి ఉందనే ఆందోళన రేషన్ కార్డు దారుల్లో మొదలైంది. అలాంటి వారికి ఎలాంటి టెన్షన్ లేకుండా మరో నెలరోజుల పాటు అవకాశం కల్పించింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి పనులు

Latest News

More Articles