మేడ్చల్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం ధర్మారం గ్రామంలో శనివారం కమ్యూనిటీహాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మేడ్చల్ జిల్లాలో అభివృద్ధి పనులు జరిగి.. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా మారిందన్నారు.
కోట్లాది రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, ప్రభుత్వ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఆటకెక్కుతుందని అన్నారు. ఆరు గ్యారెంటీలను అమలులో చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారని, ప్రజలు అంతా తమ వైపే ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి వెంట ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ ఉన్నారు.
Also Read.. బీటలు వారిన వరిపంట.. మళ్లీ బావులు తవ్వే పరిస్థితి ఏర్పడింది