సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. భూ తగాదాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తలెత్తి.. అది చంపుకునే దాకా వెళ్లింది. గొడ్డల్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. గొడ్డలితో దాడి చేయగా తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా.. అడ్డొచ్చిన తండ్రికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read.. ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి.. ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు