Monday, May 20, 2024

మంచివారికి దగ్గరగా.. చెడ్డవారికి దూరంగా ఉండాలి

spot_img

రెడ్లంటే యోధులు, లీడర్లు, నాయకులు అని ఎంపీ బండి పార్థసారధి రెడ్డి అన్నారు. రెడ్లు నాడు రాజులుగా కూడా పరిపాలన సాగించారని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బండి పార్థసారధి రెడ్డిని రెడ్డి సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమం సంఘం జిల్లా అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి, నాయకులు నూకల నరేష్ రెడ్డి, రెడ్డి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ.. ‘రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సన్మానానికి ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యునిగా నేను మీ ముందున్నానంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశం. సీఎం కేసీఆర్‎కు నేను సదా రుణపడి ఉంటాను. వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. రెడ్లంటే యోధులు, లీడర్లు, నాయకులు. నాడు రాజులుగా కూడా పరిపాలన సాగించారు. సమాజం వేగంగా మారుతుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా మన పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. ఏ కులంలో అయినా మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మంచివారికి దగ్గరగా ఉండటం, చెడ్డవారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఒకరినొకరు కించపరచుకోవటం, చులకన చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మన ద్వారా సమాజానికి, మన పిల్లల భవిష్యత్తుకు మంచి జరగాలి’ అని ఎంపీ బండి పార్థసారధి రెడ్డి అన్నారు.

Latest News

More Articles