Friday, May 17, 2024

సీఎం కేసీఆర్ సెక్రటరీ తల్లి మృతి.. హరీష్ రావు పరామర్శ

spot_img

సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు నివాళులు అర్పించారు. రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలోని రాజశేఖర్‌రెడ్డి స్వగృహానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఇక తన తల్లి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మెదక్‌ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Latest News

More Articles