Wednesday, May 22, 2024

ఆఫీస్ బాయ్‎కు దీపావళి కానుకగా కొత్త కారు

spot_img

ఏ కంపెనీలోనైనా పండుగల సమయంలో ఉద్యోగులకు బోనస్‎లు, బహుమతులు ఇస్తుంటారు. కొన్ని కంపెనీలు స్వీట్ బాక్సులు ఇస్తుండగా.. మరికొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులకు ఊహించని బహుమతులు కానుకగా అందిస్తుంటాయి. తాజాగా ఇలాగే ఓ కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి ఆశ్యర్యానికి లోనుచేసింది.

Read Also: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ సూసైడ్

హర్యానాలోని పంచకులలో మిట్స్ హెల్త్‌కేర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. చాలా ఏండ్ల క్రితం స్థాపించిన ఈ కంపెనీలో కొంతమంది ఉద్యోగులు మొదటినుంచి పనిచేస్తున్నారు. వారందరినీ స్టార్ ఉద్యోగులుగా భావించిన కంపెనీ డైరెక్టర్ భాటియా.. అందులో 12 మందికి కార్లను బహుమతిగా అందించాడు. వీరందరికీ టాటా పంచ్ కార్లను దీపావళి కానుకగా ఇచ్చాడు. సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కూడా కార్లను అందించాలని కంపెనీ యోచిస్తోంది.

కాగా.. ఈ గ్రాండ్ దీపావళి బహుమతిని అందుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండటం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కార్లను అందుకున్న కొంతమంది ఉద్యోగులకు డ్రైవింగ్ కూడా తెలియకపోవడం.

Read Also: హరీష్‎రావు భారీ మెజారిటీతో గెలవాలని వృద్ధులకు ఫ్రీ కటింగ్‌, షేవింగ్‌

ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత, విశ్వసనీయత వల్లే తన కంపెనీ విజయం సాధిస్తున్నదని డైరెక్టర్ చెప్పారు. వీరిలో కొంతమంది కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి తమ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు. అటువంటి వారికి కార్లు ఇవ్వగా.. మంచి పర్‎ఫార్మెన్స్ చూపించిన వారికి రివార్డులు కూడా ఇచ్చినట్లు భాటియా చెప్పారు.

Latest News

More Articles